టి20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతుంది.
2022లో మొదలైన జోరు 2023లోనూ కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉన్నాడు.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టి20లో 47 పరుగలు చేసిన సూర్యకుమార్ యాదవ్ పలు మైలురాళ్లను అందుకున్నాడు.
టి20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో పాటు సురేశ్ రైనాలను దాటేశాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 1,625 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
1,759 పరుగులతో శిఖర్ ధావన్ 4వ స్థానంలో ఉన్నాడు.
2,265 పరుగులతో కేఎల్ రాహుల్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 3,853 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టాపర్ గా విరాట్ కోహ్లీ 4,008 పరుగులతో ఉన్నాడు.