Chiranjeevi - Garikapati: దసరా నెక్ట్స్ డే హైదరాబాద్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవిని మధ్య ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే.. అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతున్న సమయంలో.. గరికపాటి ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని అన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు సహా మెగా ఫ్యాన్స్ గరికిపాటిపై సోషల్ మీడియాలో ఘాటైన విమర్శలు చేసారు.