ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. బాపట్ల మండలం వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో పిడుగు పడి 150 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ రోజు ఉదయం భారీ వర్షం, ఉరుములు మెరుపులతో పిడుగులు పడటంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఒక్కసారిగా పిడుగు గొర్రెలపై పడటంతో మూగ జీవాలు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచాయి. వీటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కాగా, వందల సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపర్లు కన్నీరుమున్నీరవుతున్నారు.