ఆ మధ్య ఏపీలో టీడీపీ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే ఓ సంఘటన తాజాగా తెలంగాణలో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్కు చెందిన ఓ నేతను మావోలు కిడ్నాప్ చేసారంటూ వార్తలు దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరు గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు అనే టీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీను మావోయిస్టులు ఆయుదాలతో వచ్చి.. ఆయన ఇంటిలోకే చొరబడి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఈ కిడ్నాప్కు
గల కారణాలు మాత్రం తెలియరాలేదు.