కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో నిర్మించిన నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి భార్య పుష్పతో కలసి కొత్త ఇంట్లో పాలు పొంగించి గణపతి పూజ, వాస్తు పూజ, హోమం సత్యనారాయణ వ్రతం చేశారు. తర్వాత అధికారికంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని స్పీకర్ పోచారం ప్రారంభించారు.