నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు, వినోద కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న దుర్గం చెరువును ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఇక్కడ చెరువుపై నిర్మిస్తున్న తీగల వంతెన పనులపై మంత్రి ఆరా తీశారు. ఈ చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి మే నెలాఖరు నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.