కేంద్ర ప్రభుత్వం తెస్తున్న NMC బిల్లును వ్యతిరేకిస్తూ... దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు వైద్య సేవల్ని నిలిపివేశారు. వైద్య మహా ఘటన పేరుతో జూనియర్ డాక్టర్లు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర గురువారం ధర్నా చేశారు. ఎన్ఎంసీ బిల్లులో కొన్ని క్లాజుల్ని మార్చాలని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా నిలిచారు డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత. జూడాలు చేస్తున్న ధర్నా న్యాయ సమ్మతమైందన్నారు. మరోవైపు ఈ ధర్నా వల్ల వైద్య సేవలకు ఆటంకం కలగడంతో రోగులు మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు.