హైదరాబాద్ శివారు షాద్నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్పై హత్యాచార ఘటనపై గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తెలంగాణకు చెడ్డ పేరు తీసుకొస్తాయన్నారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న సంకేతాలు వెళ్తాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి,మహిళలకు భద్రత కల్పించే చర్యలు కల్పించాలన్నారు.