ఎన్నో ఉద్యమ సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. ఆ సంఘాల సమస్యల్ని తెరపైకి తెస్తున్న జర్నలిస్టులు... తమ సమస్యలపై ఆందోళనలకు దిగారు. తెలంగాణ కమిటీ ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్వర్యంలో కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ ముందు చేపట్టిన జర్నలిస్టుల ధర్నాకు సీపీఐ మద్దతు తెలిపింది. సిపిఐ నేత నారాయణ, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య జర్నలిస్టులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.