దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ మ్యూజియం హైదరాబాద్లో ఏర్పాటైంది. ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సహకారంతో ఏర్పాటైన ఈ మ్యూజియాన్ని శుక్రవారం ప్రారంభించారు. బీఏసీఆర్ఐ 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బిర్లా సైన్స్ మ్యూజియంలో దీన్ని ఏర్పాటు చేశారు.ఇస్రో పరిశోధనలు,ఖగోళ విజ్ఞానం,విజయాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. 2D,3D మోడల్స్ సహాయంతో మ్యూజియంలోని ఖగోళ వస్తువులను పరిశీలించవచ్చు. జీఎస్ఎల్వీ ఎంకే-3, చంద్రయాన్ లాంచ్ వెహికిల్, రోహిణి, ఆపిల్, చంద్రయాన్-1, మంగళ్యాన్ లాంటి ఉపగ్రహాలను మ్యూజియంలో అందుబాటులో ఉంచారు.