హైదరాబాద్లో చలి పెరిగిపోవడంతో సిటీలో బహిరంగ స్థలాల్లో నిద్రపోయేవాళ్లకు దుప్పట్లను ఫ్రీగా ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నేటి రాత్రి సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో రోడ్ల పక్కన, ఫుట్పాత్లపై నిద్రపోయేవాళ్లను గుర్తించి దుప్పట్లను ఇవ్వనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఇప్పటికే సిటీలో నిరాశ్రయులకు 15 నైట్ షెల్టర్లను ఏర్పాటు చేశామన్న ఆయన... వాటిలో దాదాపు 700 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.