హైదరాబాద్ మెట్రో రైలు మళ్లీ ఆగింది. శనివారం ఉదయం నాగోల్ నుండి హైటెక్ సిటీ వెళ్తున్న మార్గంలో విద్యుత్ అందక పోవడంతో ప్యారడైజ్ వద్ద రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్టేషన్లో మెట్రో ఆగిపోవడంతో అటువైపుగా వెళ్లే సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రైన్ ఎంతకీ కదలక పోవడంతో ప్రయాణికుల్నీ మరో ట్రైన్లో తరలించారు.