మెదక్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సియస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున క్రైస్తవులంతా చర్చి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.మరోవైపు 450 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమీటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.