సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టానికి తెర లేచింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ లోక్సభ స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. అందులో భాగంగా.. ఈరోజు హైదరాబాద్లో చిరంజీవి కుటుంబం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.