తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తున్నా ఏమీ రావడం లేదని అబద్ధాలు చెబుతున్నారని కేసీఆర్ మీద మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని ఆరోపించారు. అసదుద్దీన్ మీద పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. ‘ఈ మధ్య మా బామ్మర్ది భయపడుతున్నారు. ఇన్నాళ్లూ వందేమాతరం, జనగణమన పాడని వారు జాతీయ జెండా పట్టని వారు దారుస్సలాంలో జాతీయ జెండా ఎగరేస్తున్నారు.’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.