నిర్మల్లో రోడ్డు ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే..మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన దొంతుల రాజేశ్వర్, గన్నాల రాజగౌడ్లు బైక్పై నిర్మల్ వస్తున్నారు. అయితే శివాజీ చౌక్ వద్ద సిగ్నల్ పడడంతో నిర్మల్ వైపు వెళ్దామనీ..అటు వైపు మళ్లుతున్న సమయంలో వెనుక నుండి వస్తున్న టిప్పర్..ఈ ఇద్దరిని డీ కొట్టింది. దీంతో వెనుక కుర్చోన్న రాజుగౌడ్ మీద నుండి టిప్పర్ వెళ్లడంతో అక్కడిక్కడే మరణించాడు. రాజేశ్వర్ను దవఖానకు తరలిస్తుండగా..మద్యలోనే మరణించాడు. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.