కొత్త వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని కొన్ని నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులు ఉద్యమాన్ని విస్తృతం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున తలపెట్టిన టాక్టర్ల ర్యాలీ హింసకు దారితీసిన విషయం తెలిసిందే.