వైజాగ్ విమానాశ్రయంలో వైఎస్ఆర్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. పందెంకోడి కాళ్లకు కట్టే కత్తితో వైఎస్ జగన్పై ఓ వ్యక్తి దాడి చేయడంతో వైఎస్ అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో వైజాగ్ విమానాశ్రయానికి చేరుకునే రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఈ కారణంగా పూణె వెళ్లాల్సిన భారత జట్టు కాన్వాయ్ ట్రాఫిక్లో ఇరుక్కుంది. పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తేవడంతో విరాట్ సేన... మూడోొ వన్డే మ్యాచ్ కోసం పూణె బయలుదేరి వెళ్లింది.