ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న యంగ్ క్రికెటర్ బుమ్రా. తాజాగా అంతర్జాతీయ క్రీడల వ్యాపారం, అందులో కార్పోరేట్ బాధ్యత అనే అంశంపై లండన్లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్పీత్ బుమ్రాను ఆమె కొనియాడారు. బూమ్రా వంటి యంగ్ ఆటగాళ్లను ఎందరినో ముంబై ఇండియన్ టీం ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు.