ఊపిరి తీయాలని కేంద్రం చూస్తుంటే.. కేంద్రానికే ఇప్పుడు ఊపిరి పోస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్, నష్టాల్లో ఉందనే సాకుతో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఇఫ్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తూ బాహుబలిగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం.