ఏపీ మంత్రి, టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ తన వ్యాఖ్యలతో పదేపదే ప్రత్యర్థుల చేతికి చిక్కుతున్నారు. ఇటీవల వైఎస్ వివేకా హత్యపై ఆయన చేసిన కామెంట్స్.. ఎన్నికల తేదీని తప్పుగా ప్రస్తావించడం.. సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోల్స్కు దారితీసింది. తాజాగా మరోసారి ఆయన నోరు జారారు. కేసీఆర్ ఆంధ్రాపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించబోయి.. అర్థం లేని ఆరోపణలు చేశారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోవడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు.