యూత్ ఒలింపిక్స్ 2018లో భారత యువ హాకీ జట్లు సంచలనం సృష్టించాయి. ఫైనల్ చేరిన బాలుర, బాలికల హాకీ జట్లు... ఆఖరాటలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నాయి. బాలుర జట్టు 2-4 తేడాతో మలేషియా చేతిలో ఓడిపోగా, బాలికల జట్టు ఆతిథ్య అర్జెంటీనాతో 1-3 తేడాతో ఓడారు. అయితే మూడోసారి యూత్ ఒలింపిక్స్ ఈవెంట్లో పాల్గొంటున్న భారత జట్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం... యూత్ ఒలింపిక్స్లో స్వగ్రామం చేరిన హాకీ ప్లేయర్ లాల్రెమ్సియోమికి ఘనస్వాగతం లభించింది. దేవతా విగ్రహాలపై ఊరేగించే పల్లకిలో లాల్రెమ్సియోమిని కూర్చొబెట్టుకుని, భుజాలపై మోసుకుంటూ మేళతాళాల మధ్య గ్రామమంతా ఊరేగించారు. ఇంతటి ఘనమైన స్వాగతానికి లాల్రెమ్ సియోమి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.