ఒకప్పుడు టీమిండియాతో సమానంగా క్రికెట్లో ఆధిపత్యం చూపించిన శ్రీలంక జట్టు ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. జయవర్థనే, సంగర్కర వంటి సీనియర్లు రిటైర్ అయిన తర్వాత ఘోరంగా విఫలమవుతూ వస్తోంది లంక జట్టు. ఆసియాకప్ 2018లో ఏకంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల చేతిలో కూడా ఓడి, టోర్నీ గ్రూప్ రౌండ్ నుంచి నిష్కమించింది లంక. దాంతో మాథ్యూస్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది లంక క్రికెట్ బోర్డు.