రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో ప్రముఖ భారత బాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పాల్గొన్నారు. గోపిచంద్ అకాడమిలో మొక్కలు నాటిన సింధు ఈ సందర్భంగా మాట్లాడుతూ...హరితహారం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పర్యావరణం రాను రాను క్షీణిస్తోందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు. ఈ ఛాలెంజ్లో భాగంగా ఆమె మూడు మొక్కలు నాటి.. మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. వారిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హైదరాబాద్కు చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఉన్నారు.