అర్హులకు పెద్ద మొత్తంలో పెన్షన్లను కట్ చేశారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ అర్హుల విషయంలో రీవెరిఫికేషన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అర్హుల్లో ఎవరికైనా పెన్షన్ అందకుంటే.. ఒకేసారి రెండు నెలల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు సీఎం జగన్.