చంద్రబాబు పాలనలో ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వైఎస్ జగన్ ఆరోపించారు. ఒకే కులానికి చెందిన పోలీసులకే పదోన్నతులు ఇచ్చారని..ఆ డీఎస్పీలు చంద్రబాబుకు తొత్తులుగా మారరానని మండిపడ్డారు. హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన జగన్.. పోలింగ్ తర్వాత ఏపీలో పరిస్థితిపై ఫిర్యాదు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ని టీడీపీ నేతలు యథేచ్చగా తెరుస్తున్నారని.. కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై చంద్రబాబునాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు జగన్. 2014 ఇవే ఈవీఎంలతో చంద్రబాబు గెలిచారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు వైసీపీ అధినేత.