పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞాన్ని శుభారంభం చేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాజాగా ఓపెన్ చేసిన టెండర్లలో కేవలం రూ.290 కోట్ల విలువైన పనుల్లోనే ప్రభుత్వానికి సుమారు రూ.50 కోట్ల నిధులు ఆదా అవుతాయన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్కు ప్రాజెక్టు దక్కదన్న అక్కసుతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అనిల్ ఆరోపించారు.