వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈరోజు హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విమానంలో బేగంపేట చేరుకున్న జగన్.. నేరుగా రాజ్భవన్ వెళ్లారు.