హైదరాబాద్, కడపల్లోని సీఎం రమేష్ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 60 మంది ఐటీ సిబ్బంది పది ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. సీఎం రమేష్కు వచ్చే ఆదాయానికి, ఆయన చెల్లించే ఆదాయపన్నుకు పొంతన లేకపోవడంతో ఐటీ దాడులు చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడైన సీఎం రమేష్.. ఈ మధ్య ఐటీకి ఓ లేఖ రాశారు. దేశంలో ఎక్కడెక్కడ ఐటీ దాడులు చేశారు? అందులో ఎంత పట్టుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. అది జరిగిన మూడు రోజుల్లోనే సీఎం రమేష్ మీద ఐటీ దాడులు జరిగాయి.