మోదీ వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఐటీ దాడులు చేయిస్తోందని టీడీపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, కడప ఉక్కు కోసం పోరాడుతున్న సీఎం రమేష్ మీద ఐటీ దాడులు చేయించడాన్ని ఖండించారు. మోదీ ప్రభుత్వం కేంద్ర వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటోందని దినకర్ మండిపడ్డారు.