ఏపీ రాజధానుల అంశంపై సీఎం జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానులపై ఓటింగ్ పెట్టాలని, 151 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నీకు ఆ దమ్ముందా అంటూ జగన్కు సవాల్ చేశారు. రాష్ట్రం పిచ్చి తుగ్లక్ పాలనలో ఉందని విమర్శించారు. అమరావతి రైతులను ఉద్దేశించి పెనుకొండలో మాట్లాడిన చంద్రబాబు.. పోలీసోళ్లు కొడితే ఏమీ అనొద్దని, ఒక పువ్వు లేదా పండు ఇవ్వాలని, అవసరమైతే పోలీసుల బూట్లు తుడవాలని సూచించారు.