భారత రాజ్యాంగ సృష్టికర్త మహానీయులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129 జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మల్యే భుపాల్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ గారు చేసిన సేవలను గుర్తుచేశారు. అలాగే ఆయన చూపెట్టిన మార్గంలో అందరూ నడవాలని కోరారు. అలాగే కరోనా వైరస్ నివారణకై అందరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయరాదని తెలిపారు.