గతకొన్ని నెలల హైడ్రామాకు తెరదించుతూ 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరితీశారు. ఇవాళ ఉదయం 5.30 గం.లకు నలుగురు రేపిస్టులకు ఉరిశిక్షను అమలు చేశారు. అయితే మహిళలు పెద్ద ఎత్తున నిర్భయ ఇంటి వద్దకు చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవిని అందరు అభినందించారు.