చివరి దశలో కూడా బెంగాల్లో పరిస్థితి మారలేదు. ఏడో దశలో పశ్చిమ బెంగాల్ లోని 9 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఐతే... చాలా చోట్ల బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల రిగ్గింగులు కూడా జరుగుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని బీజేపీ నేత అనుపమ్ హజ్రా ఆరోపించారు. తాము ఎంత వారించినా రిగ్గింగ్ ఆపట్లేదని ఆమె భద్రతా దళాలకు కంప్లైంట్ ఇచ్చారు.