తమిళనాడులో ఎక్కడ చూసినా బిగిల్ మేనియా కనిపిస్తోంది. ఈ చిత్ర విడుదల నేపథ్యంలో చెన్నైలోని కృష్ణగిరిలో ఉన్న మూడు థియేటర్ల వద్ద అభిమానులు బీభత్సం సృష్టించారు.స్పెషల్ షో వేయలేదన్న కారణంగా థియేటర్పై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు,థియేటర్ ముందున్న దుకాణాలకు నిప్పంటించారు.అక్కడి కూడలిలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ను సైతం ధ్వంసం చేశారు. 'బిగిల్' స్పెషల్ షో వేసేంతవరకు తాము వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయక తప్పలేదు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా హింసకు పాల్పడిన 37మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వారిలో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ పైకి వారు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి.