ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఢిల్లీలో భారత పారిశ్రామిక వేత్తలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖాముఖి నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజిండ్ డైరెక్టర్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్.. భారత్లో అపూర్వమైన స్వాగతం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ రావడంతో సంస్కరణలకు అవకాశం చిక్కిందని ట్రంప్ తెలిపారు. అమెరికాలో ఒబామా కేర్ను మించి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు.