గుజరాత్లో అభివృద్ధి సంగతేమోగానీ... అడవుల్ని నరికేస్తున్నారు. ముఖ్యంగా సింహాలు, పులలకు నిలయమైన గిర్ అడవుల్ని నాశనం చేస్తున్నారు. దాంతో... జంతువులు, పక్షుల సంఖ్య తగ్గిపోయి... వన్య మృగాలకు ఆహారం దొరకట్లేదు. తిండి కోసం అవి... ఎటుబడితే అటు వెళ్తూ... దారి తప్పి... జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా 7 సింహాలు... రాత్రివేళ సిటీలోకి వచ్చేశాయి. లక్కీగా ఆ టైంలో జనం నిద్రపోతున్నారు కాబట్టి ఏ ప్రమాదమూ జరగలేదు. కాసేపు సిటీలో తిరిగిన సింహాలు... ఇక్కడ కంటే అడవిలోనే బెటరనుకున్నట్లున్నాయి. తిరిగి వెళ్లిపోయాయి.