ఇండియా - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో... గత గురువారం ఆపేసిన సంఝౌతా ఎక్స్ప్రెస్ సర్వీసులను పాకిస్థాన్ మళ్లీ ప్రారంభించింది. లాహోర్ నుంచీ ప్రయాణికులతో ఎక్స్ప్రెస్ బయలుదేరింది. అందులో సాధారణ ప్రయాణికులతోపాటూ... లాహోర్లో చిక్కుకుపోయిన 25 మంది కూడా భారత్ బయలుదేరారు. సాధారణంగా సంఝౌతా ఎక్స్ప్రెస్లో రెండు వైపుల నుంచీ ప్రతీ ట్రిప్పుకీ వెయ్యి మందికి పైగా ప్రయాణికులు ఉంటారు. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే స్టేషన్ నుంచి వారంలో రెండుసార్లు రాత్రి 11.10 గంటలకు ట్రైన్ లాహోర్కు వెళ్తుంది. లాహోర్ నుంచి ఢిల్లీకి రైలు ప్రతి సోమ, మంగళవారాల్లో వస్తుంది.