జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా... ఒక జవాన్ వీరమరణం పొందారు.