ఏపీ నూతన సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జగన్ చేత నవ్యాంధ్ర రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసాక్షిగా అంటూ... జగన్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు... తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా హాజరయ్యారు.