దశాబ్ధాల నాటి అయోధ్య రామజన్మభూమి వివాదానికి నవంబరులో సుప్రీంకోర్టు పరిష్కారం చూపించిన విషయం తెలిపిందే. ఐతే ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 4 నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తులో రామ మందిరాన్ని నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించిందని.. త్వరలోనే అయోధ్య రాముడు భక్తులకు దర్శనమిస్తాడని తెలిపారు. ఝార్ఖండ్లోని పాకూర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.