'రేప్ ఇన్ ఇండియా' అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన తీరుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన దృష్టిలో దేశంలోని మగవాళ్లనంతా రేపిస్టులా? అని నిలదీశారు. గాంధీ కుటుంబంలో పుట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఒకవేళ క్షమాపణ చెప్పినా అది సరిపోదని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు.