దేశవ్యాప్తంగా రేపు జరగనున్న ఐదో దశ పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఉత్తర్ప్రదేశ్లో 14, రాజస్థాన్లో 12, పశ్చిమ బెంగాల్లో 7, మధ్యప్రదేశ్లో 7, బిహార్లో 5, ఝార్ఖండ్లో 4, జమ్మూకశ్మీర్లో 2 స్థానాలకు పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.