మూడో దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకునే ప్రధాని మోదీ గుజరాత్లోని గాంధీ నగర్ వెళ్లారు. ఈ సందర్భంగా తన తల్లి నివాసానికి వెళ్లిన ఆయన.. ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెకు చీరను కానుకగా ఇచ్చారు. అనంతరం ఆమెకు మిఠాయి తినిపించారు.