అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. భారతదేశంలో హిందువులనే కాకుండా భారతీయులందరినీ రక్షించాలని, మన దేశంలో అన్ని మతాలను, జాతులను, కులాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. మతం పౌరసత్వానికి ఆధారం కాదని హితవుపలికారు. ‘ఇది హిందూ దేశం కాదు. ఎప్పటికి కాదు కూడా.’ అని విరుచుకు పడ్డారు.