అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టైన యువకులను నందిగామ సబ్ జైలులో టీడీపీ నేత నారా లోకేష్ పరామర్శించారు. యువకుల అరెస్ట్కు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం జరిగిన ర్యాలీలో నారా లోకేష్ పాల్గొన్నారు. జై హింద్ అన్నందుకు బ్రిటిష్ వాళ్లు జైళ్లలో పెడితే.. ఇప్పుడు జై అమరావతి అన్నందుకు వైఎస్ జగన్ జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు లోకేష్. అదేవిధంగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై కూడా విమర్శలు చేసారు. అయన పర్యటనకు డబ్బులు దండగని, కారుకి డీజిల్ దండగని, ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ రాష్టానికి ఏమితెచ్చారని ప్రశ్నించారు.