ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ ప్రజలకు అనేక వాగ్ధానాలు, హామీలు ఇచ్చానని... వాటిని నేర వేర్చేందుకే టీఆర్ఎస్లోకి వెళ్తున్నానని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు. ఎల్బీ నగర్లో ప్రజాసమస్యలను పరిష్కరించడం కేసీఆర్ వల్లే అవుతుందనే నమ్మకంతో.. ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరారు.