తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం విఫలమైంది. అయితే, దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ‘తెలంగాణలో పది మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పా. అయితే, అందులో ఇద్దరు గెలిచారు. మిగిలిన ఎనిమిది మంది రెండో స్థానంలో వచ్చారు. ప్రజల నాడి పట్టుకోకపోతే ఆ విషయం తెలిసేది కాదు.’ అని లగడపాటి అన్నారు.