మోదీ వస్తే దేశంలో సమూల మార్పులు జరిగుతాయని నేను సైతం ఆనంద పడ్డాను అన్నారు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ. కానీ మోదీ వచ్చాక ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. వ్యవస్థమీద ఆయనకు ఎలాంటి అవగాహన లేదన్నారు. మోదీకి మాటలే కాని చేతల్లేవు అని విమర్శించారు జేపీ. అహంకారంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు.