వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ను కలిసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు వైసీపీ ముఖ్యనేతలు జగన్తో కలసి ప్రగతిభవన్కు వెళ్లారు. తొలిసారి ప్రగతిభవన్కు వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు